గాలిపటానికి రూ. 2 అడిగితే.. పొడిచేశాడు! | Delhi man stabs 5-year-old son who asked for Rs 2 to buy kite | Sakshi
Sakshi News home page

గాలిపటానికి రూ. 2 అడిగితే.. పొడిచేశాడు!

Jan 17 2017 10:15 AM | Updated on Aug 16 2018 4:31 PM

గాలిపటానికి రూ. 2 అడిగితే.. పొడిచేశాడు! - Sakshi

గాలిపటానికి రూ. 2 అడిగితే.. పొడిచేశాడు!

సంక్రాంతి సీజన్‌లో తోటి పిల్లలంతా గాలిపటాలు ఎగరేసుకుంటున్నారని ఆ పిల్లాడు కూడా ముచ్చటపడ్డాడు.

సంక్రాంతి సీజన్‌లో తోటి పిల్లలంతా గాలిపటాలు ఎగరేసుకుంటున్నారని ఆ పిల్లాడు కూడా ముచ్చటపడ్డాడు. ''నాన్నా, గాలిపటం కొనుక్కుంటా.. రెండు రూపాయలు ఇవ్వవా'' అని ముద్దుగా అడిగాడు. ఆ మాత్రం దానికే ఆ తండ్రికి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు గానీ సదరు తండ్రి ఆ కొడుకును దారుణంగా కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన వారణాసిలో జరిగింది. వినోద్ రాజ్‌భర్ (35) తన భార్య గాయత్రి, కుమార్తె కోమల్, ఇద్దరు కొడుకులు శివం, సత్యంలతో కలిసి వారణాసిలోని గంజ్ ప్రాంతంలో ఉంటాడు. 
 
ఇటీవలి కాలంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో శివం గాలిపటం కొనుక్కుంటానని డబ్బులు అడిగాడు. అప్పటికే బాగా తాగి ఉన్న వినోద్.. కొడుకును మేడ మీదకు తీసుకెళ్లి, అతడిని తీవ్రంగా కత్తితో పొడిచాడు. తండ్రి అన్నయ్యపై దాడి చేస్తుండటాన్ని చూసిన సత్యం.. ఆ విషయాన్ని తన తల్లి గాయత్రికి చెప్పగా ఇద్దరూ కలిసి శివాన్ని ఆస్పత్రికి తరలించారు. పిల్లవాడి ఏడుపు విన్న చుట్టుపక్కల వాళ్లు ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వాళ్లు వచ్చి వినోద్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత సత్యాన్ని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement