తివారీ వ్యవహారంలో ట్విస్ట్! | BJP says Congress veteran ND Tiwari has not joined party | Sakshi
Sakshi News home page

తివారీ వ్యవహారంలో ట్విస్ట్!

Jan 18 2017 7:18 PM | Updated on Mar 29 2019 9:31 PM

తివారీ వ్యవహారంలో ట్విస్ట్! - Sakshi

తివారీ వ్యవహారంలో ట్విస్ట్!

ఎన్డీ తివారీ పార్టీ మారినట్టు వచ్చిన వార్తలు తూచ్ అని తేలిపోయింది.

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణదత్త తివారీ పార్టీ మారినట్టు వచ్చిన వార్తలు తూచ్ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఎన్డీ తివారీ బీజేపీలో చేరిపోయినట్టు ఈరోజు వార్తలు వచ్చాయి. అయితే ఆయన తమ పార్టీలో చేరలేదని బీజేపీ వెల్లడించింది. తివారీ కుమారుడు రోహిత్‌ శేఖర్ మాత్రమే తమ పార్టీలోకి వచ్చారని తెలిపింది.

తన కుమారుడితో పాటు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కావడంతో తివారీ పార్టీ మారినట్టు ప్రచారం జరిగింది. తన కుమారుడిని బీజేపీలో చేర్పించేందుకే ఆయన అమిత్ షాను కలిసినట్టు తేలింది. అయితే తివారీ బీజేపీలో చేరినట్టు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement