
ఎస్పీలో సంచలనం: అఖిలేశ్పై వేటు
ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీ సమాజ్ వాదీలో ఆధిపత్య అగ్ని పర్వతం బద్ధలైంది. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధినేత ములాయం సింగ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
(235 మందితో అఖిలేశ్ జాబితా)
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ టికెట్ల వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని మరింత పెంచింది. సీఎం అఖిలేశ్ సూచించినవారికి కాకూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తూ ములాయం 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే తండ్రి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అఖిలేశ్.. 235 మంది పేర్లతో కూడి రెబర్స్ జాబితాను ప్రకటించారు. అఖిలేశ్ తిరుగుబాటు చర్యను తీవ్రంగా పరిగణించిన ములాయం.. శుక్రవారం ఉదయం షోకాజ్ నోటీసులు జారీచేశారు. మరి కొద్ది గంటల్లోనే అఖిలేశ్ సహా రాంగోపాల్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
1.(ములాయం కుటుంబంలో ఏం జరిగింది?)