* రూ. 5.50 కోట్లతో ల్యాండ్ క్రూయిజర్లు
* మూడోసారి మారిన వాహన శ్రేణి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కాన్వాయ్ ముచ్చటగా మూడోసారి మారింది. అత్యాధునిక భద్రతతో పాటు... అత్యంత ఖరీదైన వాహనాలు సీఎం కాన్వాయ్లో కనిపించనున్నాయి. దేశంలో ప్రధాని, రాష్ట్రపతి తర్వాత అత్యంత ఖరీదైన కాన్వాయ్ని కేసీఆర్ మాత్రమే వాడుతున్నట్టు సమాచారం. దాదాపు ఒక్కోటి రూ. కోటి 10 లక్షల చొప్పున అయిదు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో వాహనాలు ఇందులో ఉన్నాయి.
బుధవారం ఉదయం యాదగిరిగుట్టలో వీటికి పూజ చేయించారు. అనంతరం కొత్త కాన్వాయ్లోనే సీఎం సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఇంతకు ముందు అయిదు ఫార్చూనర్, రెండు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఉండేవి. వీటిస్థానంలో ఇప్పుడు అయిదు క్రూయిజర్, రెండు ఫార్చూనర్ వాహనాలు, అంబులెన్స్తో భద్రతా విభాగం కొత్త కాన్వాయ్ను సిద్ధం చేసింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో ఈ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ సదుపాయాన్ని అమర్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కేసీఆర్ కాన్వాయ్లో నల్లరంగు ఫార్చూనర్ వాహనాలు ఉండేవి.
ముఖ్యమంత్రి సూచనలతో ఈ వాహనాల రంగును మార్చేందుకు అప్పట్లోనే ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు చేసింది. అన్ని వాహనాలను తెలుపు రంగులోకి మార్పించారు. అనంతరం రెండు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు మొత్తం కాన్వాయ్ను క్రూయిజర్ వాహనాలతో సిద్ధం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల్లో భద్రతకు వీలుగా కొత్తగా రక్షక్ వాహనాన్ని సైతం తెప్పించారు. దీంతోపాటు రూ.5 కోట్లతో తయారు చేసిన ఒక ప్రత్యేక బస్సును హరితహారం జిల్లాల పర్యటన కోసం కొనుగోలు చేశారు.
మళ్లీ మారిన సీఎం కాన్వాయ్
Published Thu, Aug 6 2015 9:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement