నీళ్ల ఉత్సవంలో 11 మంది మృతి | 11 killed, 134 injured during Myanmar water festival | Sakshi
Sakshi News home page

నీళ్ల ఉత్సవంలో 11 మంది మృతి

Apr 18 2015 10:22 AM | Updated on Sep 3 2017 12:28 AM

నీళ్ల ఉత్సవంలో 11 మంది మృతి

నీళ్ల ఉత్సవంలో 11 మంది మృతి

మయన్మార్లో ప్రతియేటా నాలుగు రోజుల పాటు జరిగే నీటి ఉత్సవంలో 11 మంది మరణించగా, 134 మంది గాయపడ్డారు.

మయన్మార్లో ప్రతియేటా నాలుగు రోజుల పాటు జరిగే నీటి ఉత్సవంలో 11 మంది మరణించగా, 134 మంది గాయపడ్డారు. బర్మాదేశీయుల కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఉత్సవం చేసుకుంటారు. నీటి ఉత్సవంతో తప్పులు, పాపాలు అన్నీ కొట్టుకుపోతాయన్నది వాళ్ల విశ్వాసం.

అయితే.. ఉత్సవానికి బాగా ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాటలు, డ్రగ్స్ సేవించడం, మద్యం తాగడం, వేగంగా వాహనాలు నడపడంతో 50కి పైగా ప్రమాదాలు జరిగి 11 మంది మరణించారు. 134 మంది గాయపడ్డారు. గత సంవత్సరం జరిగిన ఉత్సవాల సందర్భంగా కూడా 15 మంది మరణించి, 178 మంది గాయపడ్డారు. ఒకళ్ల మీదకు ఒకళ్లు నీళ్లు విసురుకునేందుకు చిన్నా పెద్దా కలిపి దాదాపు 200 వరకు మండపాలు ఏర్పాటుచేశారు.

Advertisement

పోల్

Advertisement