తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విభాగం గురువారం నుంచి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. రేపు మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.