అంజయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ | YS Sharmila Paramarsha Yatra | Sakshi
Sakshi News home page

అంజయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ

Jun 29 2015 4:13 PM | Updated on Mar 28 2018 11:08 AM

అంజయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ - Sakshi

అంజయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన జిల్లెల్లగూడకు చెందిన బి అంజయ్య కుటుంబీకులను వైఎస్ షర్మిల సోమవారం సాయంత్రం పరామర్శించారు.

జిల్లెలగూడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక  మృతిచెందిన జిల్లెల్లగూడకు చెందిన బి అంజయ్య కుటుంబీకులను  వైఎస్ షర్మిల సోమవారం సాయంత్రం పరామర్శించారు. నాలుగు రోజుల రంగారెడ్డి జిల్లా పరామర్శయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జిల్లెలగూడ చేరుకున్నషర్మిల..  తొలుత అక్కడ మందలమ్మ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంజయ్య ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

 

ఈ రోజు మరో రెండు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మహేశ్వరం మండలం మంఖాల్‌లో ఎండల జోసెఫ్ కుటుంబ సభ్యులను, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement