⇒ కొత్తగా డివిజన్లు, సబ్ డివిజన్ల ఏర్పాటు
⇒52 మంది వివిధ కేడర్ల ఇంజనీర్ల కేటాయింపు
⇒ఉత్తర్వులు విడుదల చేసిన రేమండ్ పీటర్
⇒ఇక వేగంగా కొనసాగనున్న పనులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్ గ్రిడ్’ పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ నీటి సరఫరా పథకం పునర్విభజనలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్కు తోడు వాటర్గ్రిడ్ పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను ఇకనుంచి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టు (టీడీడబ్ల్యూఎస్పీ)’ చేపట్టనుంది.
ఇంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సర్కిళ్లు, 25 డివిజన్లు, 67 సబ్డివిజన్లు ఉండగా, వాటర్గ్రిడ్ కోసం 9 సర్కిళ్లు, 20 డివిజన్లు, 92 సబ్డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం జిల్లాలో మూడు డివిజన్లు, 15 సబ్ డివిజన్లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ఆర్డబ్ల్యూఎస్ కింద నిజామాబాద్, బాన్సువాడ డివిజన్లు ఉండగా,టీఎస్డబ్ల్యూఎస్పీ కింద నిజామాబాద్,బాన్సు వాడ, ఆర్మూరు డివిజన్లు వాటర్గ్రిడ్ కోసం పనిచేస్తాయి. వాటర్గ్రిడ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక చీఫ్ ఇంజినీర్, 10 ఎస్ఈలు, 31 మంది ఈఈలు, 104 మందిడిప్యూటీ ఈఈలు, 346 ఏఈఈ/ఏఈలను నియమించనుండగా, జిల్లాకు ఒక ఎస్ఈ, ముగ్గురు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లతో పాటు డిప్యూటీ ఈఈలు, ఏఈఈలను కేటాయించారు.
నిజామాబాద్ కేంద్రంగా వాటర్గ్రిడ్ కోసం ఒక క్వాలిటీ కంట్రోల్ డివిజన్, నిజామాబాద్, బాన్సువాడలలో రెండు సబ్డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 35 రెగ్యులర్ వర్క్ఇన్స్పెక్టర్లకు తోడు 17 మందిని ఔట్సోర్సింగ్ ద్వారా కొత్తగా నియమిస్తే ఆ సంఖ్య మొత్తం 52కు చేరుతుంది.
అలాగే టీడీడబ్ల్యూఎస్పీ కింద వివిధ కేడర్లకు చెందిన ఇంజినీర్లుగా పదవీ విరమణ చేసిన వారిని సైతం నియమించుకోవచ్చని ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో వాటర్గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం సర్వేల ప్రక్రియ పూర్తి చేయగా.. త్వరలోనే ఆ పథకం పనులు చేపట్టే క్రమంలో పెద్ద ఎత్తున మార్పులు, విభజనలకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశం అవుతోంది.
‘వాటర్ గ్రిడ్’కు ప్రత్యేక విభాగం
Published Sat, Feb 28 2015 3:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement