మూడు నెలలుగా గ్రామంలో తాగునీరు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులను నిర్బంధించి బయట తాళం వేశారు.
ఇల్లందుకుంట (కరీంనగర్ జిల్లా) : మూడు నెలలుగా గ్రామంలో తాగునీరు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులను నిర్బంధించి బయట తాళం వేశారు.
ఈ సంఘటన గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం ముస్కాన్పేట గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలిసిన ఎంపీపీ ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు కార్యాలయం తాళం తీశారు.