కరీంనగర్: మజ్లిస్కు తలొగ్గి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కరీంనగర్లో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల మాదిరిగానే కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు. తిరంగ్ యాత్రతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేలా కృషి చేస్తామన్నారు.
'మజ్లిస్ కు తలొగ్గడం వల్లే..'
Published Tue, Aug 16 2016 3:28 PM
Related news
-
ప్రగతి నిరోధక శక్తులకు.. పరాజయమే
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ ప్రగతి రథచక్రాలు దూసుకుపోతున్నాయని.. దేశంలో ఎక్కడ, ఎవరినోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని.. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని పేర్కొన్నారు. మన సమైక్యతే మనకు బలమని.. జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలసిన ‘సెప్టెంబర్ 17’ సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తొలుత అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న రాచరికం నుంచి పరిణామం పొంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిందని.. ఈ చారిత్రాక సందర్భాన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ వన్గా నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకు 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం నంబర్ వన్. రూ.3,12,398 తలసరి ఆదాయంతోనూ నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలన్న ధ్యేయంతో ముందడుగు వేస్తోంది. సకల జనులకు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. కొత్త వైద్య కళాశాలలతో ఏటా పది వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఆగదు హైదరాబాద్లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నాం. ఎవరైనా అర్హులకు ఇళ్లు రాకపోయినా ఆందోళన చెందవద్దు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుంది. సొంత జాగా ఉన్న పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తంగా 44 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాం. ఇక అణగారిన దళితజాతి అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంకొత్త చరిత్రను సృష్టించింది. బలహీన వర్గాల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. మద్యం దుకాణాల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు, ఈత, తాటిచెట్లపై పన్నురద్దు, 5 లక్షల వరకూ బీమా సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. రజకులు, నాయీ బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ, ఆర్థికసాయంతో అండగా నిలుస్తున్నాం. ఆదివాసీలు, గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చాం. రాష్ట్రంలో ఐటీ దూకుడు తెలంగాణ ఏర్పడే నాటికి 3,23,390 మంది ఐటీ ఉద్యోగులుంటే.. ఇప్పుడు 9,05,715 మందికి పెరిగారు. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు వృద్ధిచెందాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ టవర్లు నిర్మించుకున్నాం. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నివారించి సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూ.67 వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను పూర్తిచేస్తున్నాం. కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నగరానికి మరింత శోభ చేకూర్చాయి.’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో నాలుగేళ్లలో 1.25 కోట్ల మాగాణగా.. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, 10 లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. వీటితోపాటు కాళేశ్వరం, పాలమూరు, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి ప్రధాన ఎత్తిపోతల పథకాల ద్వారా 75లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలు సాగవుతాయి. మొత్తంగా మరో నాలుగేళ్లలో కోటీ 25 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో వ్యవసాయం పండుగగా మారింది. -
చరిత్రను తప్పుగా చిత్రీకరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్ స్టేట్లో రజాకార్ల అరాచకం సాగింది. వీటి నుంచి విముక్తికి సర్దార్ పటేల్ 1948 ఆగస్టు 10న సంకల్పించి సెప్టెంబర్ 17 నాటికి మిషన్ పూర్తిచేశారు –అమిత్ షా సాక్షి, హైదరాబాద్: సంతుష్టీకరణ రాజకీయాల కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్రే ఉండదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్ స్టేట్కు స్వాతంత్య్రం రాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉంటే.. భారతమాత కడుపులో కేన్సర్ ఉన్నట్లేనని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి కల్పించేందుకు ‘ఆపరేషన్ పోలో’కు నడుం బిగించారన్నారు. రక్తం చుక్క చిందకుండానే.. నిజాం మెడలు వంచి హైదరాబాద్ స్టేట్కు స్వాతంత్య్రం ఇప్పించారన్నారు. కేఎం మున్షీ నేతృత్వంలో, పటేల్ ఆదేశాలతో ఈ ఆపరేషన్ జరిగిందని చెబుతూ వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. పటేల్ కృషి లేకపోతే భారత్లో హైదరాబాద్ స్టేట్తో సహా వందలాది సంస్థానాల విలీనం ఆలస్యమై ఉండేదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణతోపాటు కల్యాణ కర్ణాటక, మరాఠా మహారాష్ట్ర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాజకీయాల కారణంగా విమోచన దినోత్సవా న్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదని చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో 75వ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అమిత్షా జాతీయజెండాను ఎగురవేశారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర కేంద్ర బలగాల నుంచి పోలీసు వందనాన్ని స్వీకరించారు. రావి, ఎల్లారెడ్డి పేర్ల ప్రస్తావన హైదరాబాద్ స్టేట్ విమోచన కోసం పోరాడి, ఎన్నో త్యాగాలు చేసిన స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కేశవ్రావు కోరట్కర్, రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, కాళోజి నారాయణరావు, మర్రి చెన్నారెడ్డి, పీవీ నర్సింహారావు వంటి వీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నామని అమిత్ షా చెప్పారు. ఈ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వేలాది మంది అసువులు బాసారన్నారు. ఈ ఉద్యమంలో ఆర్యసమాజ్, హిందూ మహాసభ వంటి ఎన్నో సంస్థలు పనిచేశాయని.. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర నినాదంతో నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని అమిత్ షా పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 399 రోజుల వరకు హైదరాబాద్ స్టేట్లో రజాకార్ల అరాచకం సాగిందన్నారు. జాతీయ జెండాను ఎగురవేసినందుకు పరకాలలో 1,500 మంది జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్పులు జరిపారని, ఇందులో పలువురు అమరులవగా.. మరికొందరు గాయపడ్డారని అమిత్ షా గుర్తుచేశారు. ఇదే తరహాలో మహారాష్ట్రలోని పర్భణిలో, కర్ణాటకలోని బీదర్లోనూ సామాన్యులపై కాల్పులు జరిగాయన్నారు. వీటి నుంచి విముక్తి కల్పించేందుకు పటేల్ 1948 ఆగస్టు 10న సంకల్పించి సెప్టెంబర్ 17 నాటికి మిషన్ పూర్తిచేశారని వివరించారు. 75 ఏళ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా.. యువతకు తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్పేందుకు ప్రయత్నించలేదన్నారు. హైదరాబాద్ విమోచన కోసం పోరాడిన అమరులకు శ్రద్ధాంజలి, యువత, విద్యార్థుల్లో దేశభక్తి పెంపు, రాష్ట్రానికి పునరంకితం కావాలనే మూడు ప్రధాన లక్ష్యాల సాధన కోసం ప్రధాని మోదీ చొరవతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని అమిత్ షా చెప్పారు. దీని ఫలితంగానే నేడు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరిందని, జీ20 ద్వారా భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి మరోసారి చాటామన్నారు. జీ 20ని జీ 21గా చేసిన ఘనత కూడా మోదీకే దక్కుతుందని వివరించారు. చంద్రయాన్–3 విజయవంతంతో ›ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షిస్తోందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తోందని చెప్పారు. ఆదివారం మోదీ జన్మదినం సందర్భంగా సభావేదికపై నుంచి అమిత్షా శుభాకాంక్షలు తెలిపారు. -
సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోరాటంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం
సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోరాటంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం -
13 నెలల ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్య్రం
13 నెలల ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్య్రం -
అమిత్షాతో పీవీ సింధు భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా శనివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్కు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, సీనియర్ నేతలు డీకే అరుణ, బండి సంజయ్, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, విజయశాంతి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమిత్షా సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆ ఫీసర్స్ మెస్కు చేరుకుని బస చేశారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హై దరాబాద్ విమోచన దినోత్సవాల్లో అమిత్షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. పీవీ సింధుకు అభినందన కేంద్ర మంత్రి అమిత్షాను ఒలింపిక్ పతక విజేత, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం రాత్రి తన తండ్రి, వాలీబాల్ మాజీ క్రీడాకారుడు పీవీ రమణ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలతో కలసి ఆమె సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్కు వెళ్లారు. ఈ సందర్భంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచావంటూ సింధును అమిత్షా అభినందించారు. దేశంలో క్రీడల అభివృద్ధి, అందించాల్సిన ప్రోత్సాహం, ఫిట్నెస్గా ఉండటంపై వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ప్రముఖులపై బీజేపీ ఫోకస్లో.. ఇటీవల సినీ, సంగీత, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం చూపే ప్రముఖులను బీజేపీ జాతీయ నేతలు కలసి అభినందించడం తెలిసిందే. గతంలో రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భంగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ను, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్లను అమిత్షా కలుసుకున్నారు. తాజాగా పీవీ సింధును కలిశారు. అలాగే సినీనటుడు నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, ఆర్థిక, రాజకీయరంగాల విశ్లేషకుడు కె.నాగేశ్వర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు. రాష్ట్ర నేతలతో కీలక భేటీ.. పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమం అనంతరం సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్షా సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం జాతీయ కార్యవర్గ సభ్యులు, కీలక నేతలకు మాత్రమే పిలుపు అందినట్టు పారీ్టవర్గాలు చెప్తున్నాయి. అయితే ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ బీసీలకోసం ఓ ప్రత్యేక పథకాన్ని వర్చువల్గా ప్రారంభిస్తుండటంతో.. దీనికి సంబంధించి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో కార్యక్రమం జరగనుంది. జి.కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్ అందులో పాల్గొంటుండటంతో.. అమిత్షాతో భేటీకి హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం. ఆఫీసర్స్ మెస్లో భేటీ తర్వాత అమిత్షా ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. నేడు పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. అమిత్షా, కిషన్రెడ్డి, ఇతర నేతలు ఉదయం తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకుంటారు. తొలుత అమర సైనికుల స్తూపం వద్ద నివాళులు అరి్పస్తారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అరి్పస్తారు. పారామిలిటరీ దళాల కవాతు స్వీకరించి ప్రసంగిస్తారు. కార్యక్రమం ప్రాంగణంలో 21 వేల మంది సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు.
Related News by category
-
బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా
ఖమ్మం: పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్లో కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోద్రావు, సీతారాంనాయక్ను గెలిపించాలని కోరారు.దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు..గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి అసత్య హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన చిప్ప పట్టుకొని రేవంత్రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 సీట్లనూ బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మాట్లాడుతూ ఢిల్లీలో మాదిరి ఖమ్మం కాంగ్రెస్లోనూ కుటుంబపాలన సాగుతోందని, స్థానికేతరుడైన వియ్యంకుడిని మంత్రి పొంగులేటి తెచ్చి పెట్టారని ఆరోపించారు. స్థానికుడినైన తననే ఆదరింంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తనను మరోసారి గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, విజయరామారావు, ఎం.ధర్మారావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, నాయకులు శ్రీకాంత్, నంబూరి రామలింగేశ్వరరావు, జీవీకే మనోహర్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఉప్పల శారద, నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్రబాబు పాల్గొన్నారు.ఇవి చదవండి: లెక్క తేలింది.. పోరు మిగిలింది.. -
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కావడంతో కరీంనగర్లో ఐదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. ఈ మేరకు ఫాం–5 పూరించి ఆర్వోలకు అందజేశారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.కరీంనగర్లో 2, పెద్దపల్లిలో 3 ఈవీఎంలుఒక స్థానంలో 15మంది అభ్యర్థులకు మించితే రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్దపల్లి బరిలో 42మంది ఉండటంతో మూడు ఈవీఎంలు, కరీంనగర్లో 28మంది అభ్యర్థులే ఉండటంతో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.చీలిక ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు2019లో పెద్దపల్లి లోక్సభ బరిలో 18 మంది అభ్యర్థులుండగా, ఈసారి 42 మంది పోటీలో ఉన్నారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 15 మంది పోటీలో ఉండగా ఈసారి 28మంది ప్రధాన పా ర్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరి లో ఉన్నారు. పెద్దపల్లి పరిధిలో ప్రధాన పార్టీలకు రె బల్ అభ్యర్థుల బెడద లేదు. అయితే కరీంనగర్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్ర వీణ్రెడ్డి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. దీంతో రెబల్ అభ్యర్థితో పాటు చిన్న పార్టీలు, స్వ తంత్ర అభ్యర్థులు ఓట్లు సాధించనున్నారు. వీరి ఓ ట్ల చీలిక వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఎంత మేరకు వీరి ప్రభావం ఉండనుందనే లెక్కలపై అ న్ని పార్టీల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.నేటి నుంచి పెరగనున్న ప్రచార జోరు..ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రచారాన్ని మరింత వేడెక్కించే పనిలో పడ్డారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.ఇవి చదవండి: లెక్క లేదంటే.. వేటే..! -
లెక్క లేదంటే.. వేటే..!
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.వ్యయ పరిశీలకులు వీరే..ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.పెంపు ఇలా..లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.107మంది పోటీకి అనర్హులు..రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క -
TS SSC 2024 Results: ఒక్క క్లిక్తో టెన్త్ రిజల్ట్స్ చూస్కోండి
క్లిక్ చేయండి పదో తరగతి ఫలితాలు చెక్ చేస్కోండి -
TS SSC Results 2024: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఫాస్ట్గా రిజల్ట్ను చూసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్ వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 3927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement