'మజ్లిస్ కు తలొగ్గడం వల్లే..' | TRS in clutches of AIMIM: Telangana BJP president | Sakshi
Sakshi News home page

'మజ్లిస్ కు తలొగ్గడం వల్లే..'

Aug 16 2016 3:28 PM | Updated on Sep 4 2017 9:31 AM

'మజ్లిస్ కు తలొగ్గడం వల్లే..'

'మజ్లిస్ కు తలొగ్గడం వల్లే..'

కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తోందని కె.లక్ష్మణ్ విమర్శించారు.

కరీంనగర్: మజ్లిస్‌కు తలొగ్గి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కరీంనగర్‌లో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల మాదిరిగానే కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు. తిరంగ్ యాత్రతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేలా కృషి చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement