రుణమాఫీపై అధ్యయనానికి పంజాబ్‌ బృందం | The Punjab government officials came to the state to study the farmers loan scheme | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై అధ్యయనానికి పంజాబ్‌ బృందం

Aug 5 2017 5:09 AM | Updated on Oct 1 2018 1:21 PM

రుణమాఫీపై అధ్యయనానికి పంజాబ్‌ బృందం - Sakshi

రుణమాఫీపై అధ్యయనానికి పంజాబ్‌ బృందం

రైతు రుణమాఫీ పథకంపై అధ్యయనం చేయడానికి పంజాబ్‌ ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది.

అవకతవకలు లేకుండా అమలు చేయడంపై అభినందన
సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ పథకంపై అధ్యయనం చేయడానికి పంజాబ్‌ ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. పంజాబ్‌ వ్యవసాయ సహకార విభాగం అద నపు ముఖ్య కార్యదర్శి డి.పి.రెడ్డి, ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌ సింధు, సహకార బ్యాంకు ఎండీ ఎస్‌.కె.బటీష్, పంజాబ్‌ వ్యవసాయ వర్సిటీ ఆర్థికవేత్త డాక్టర్‌ సుఖ్‌పాల్‌సింగ్‌ ఈ బృందంలో ఉన్నారు.

వారితో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి నేతృత్వంలో అధికారులు, వివిధ బ్యాంకర్లు శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. పార్థసారథి రుణమాఫీ గురించి వివరించారు. సీఎం కేసీఆర్‌ రైతు రుణమాఫీ కోసం ఒక కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ రెండు నెలలపాటు శ్రమించి అవసరమైన మార్గద ర్శకాలను రూపొందించిందని చెప్పారు. అవకతవకలకు అవకాశం లేకుండా జరిగిన రైతు రుణమాఫీ పథకాన్ని పంజాబ్‌ బృందం అభినందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement