పీటల మీద పెళ్లి ఆగిపోయింది! | Sakshi
Sakshi News home page

పీటల మీద పెళ్లి ఆగిపోయింది!

Published Sat, Mar 18 2017 5:08 PM

the marriage was stopped on the bhupala palli district

గణపురం: పెళ్లికి సిద్ధమైన వరుడి గుట్టు బయటపడడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వేరొక మహిళతో ఉన్న సంబంధాన్ని దాచిపెట్టి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో శనివారం జరిగింది.

రాంప్రసాద్‌ గౌడ్‌ అనే వ‍్యక్తి ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి చెల్పూరులో ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. విషయం ఎలాగో బయటకు పొక్కడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement