ఆలయాలను పరిరక్షించండి: లక్ష్మణ్ | Temples Developed in state, demandes telangana BJP MLA K.Lakshman | Sakshi
Sakshi News home page

ఆలయాలను పరిరక్షించండి: లక్ష్మణ్

Nov 15 2014 11:32 AM | Updated on Aug 11 2018 7:03 PM

ఆలయాలను పరిరక్షించండి: లక్ష్మణ్ - Sakshi

ఆలయాలను పరిరక్షించండి: లక్ష్మణ్

రాష్ట్రంలో ఆలయ అర్చకుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కె. లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్: రాష్ట్రంలో ఆలయ అర్చకుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కె. లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కె.లక్ష్మణ్ ఆలయ అర్చకుల పరిస్థితిపై మాట్లాడారు. ఆలయ అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని పలు దేవాలయాలు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అన్నారు. దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లక్ష్మణ్  ఈ సందర్భంగా పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement