నిప్పుల కొలిమిలో రాష్ట్రం | temparature rises in telangana districts | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమిలో రాష్ట్రం

May 11 2015 1:09 AM | Updated on Sep 3 2017 1:48 AM

నిప్పుల కొలిమిలో రాష్ట్రం

నిప్పుల కొలిమిలో రాష్ట్రం

రాష్ట్రం నిప్పుల కొలిమిలా కాగుతోంది. వాతావరణశాఖ అంచనా కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా కాగుతోంది. వాతావరణశాఖ అంచనా కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24గంటల్లో నిజామాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, రామగుండంలలో 43 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

హైదరాబాద్ వాతావరణశాఖ వివరాల ప్రకారం గత 30 ఏళ్ల సరాసరిని పరిశీలిస్తే ఈ వారం నిజామాబాద్‌లో 41 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత నమోదు కావాలి. కానీ 44 డిగ్రీలు నమోదైంది. ఏకంగా 3 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో సాధారణంగా 42 డిగ్రీలు నమోదు కావాలి. కానీ 43 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో 39కి బదులు 40 డిగ్రీలు నమోదైంది. ఈ నెలలో ఎండలు, వడగాల్పులు మరింత ఉధృతం కానున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. జూన్ నెల మొదటి వారం వరకు ఈ ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణశాఖ అధికారి వెంకటేశం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement