'పుష్కరాలపై కాంగ్రెస్ చేసేది నీచరాజకీయం' | Telangana ministers criticise opposition comments on pushkaralu | Sakshi
Sakshi News home page

'పుష్కరాలపై కాంగ్రెస్ చేసేది నీచరాజకీయం'

Jul 11 2015 3:25 PM | Updated on Mar 25 2019 3:09 PM

గులాబీ పుష్కరాలంటూ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు.

ధర్మపురి : గులాబీ పుష్కరాలంటూ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, జోగు రామన్న, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ పుష్కరాల పనులు పరిశీలించారు.

పుష్కరాల నేపథ్యంలో నీటి ఇబ్బందుల దృష్ట్యా కడెం నుంచి నీటిని విడుదల చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నీటిని విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల పనులపై కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు అర్ధరహితమని ఇంద్రకరణ్, ఈటెల వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement