
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ పేర్కొంది. ఈ మేరకు తమ అకడమిక్ క్యాలెండర్లో సెలవులను పొందు పరిచింది. మిషనరీ స్కూళ్లకు ఈ నెల 23 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ప్రకటించింది.