ఆరేళ్లు ప్రేమించి...పెళ్లి మాత్రం వద్దన్నాడు | teenage girl cheated by lover | Sakshi
Sakshi News home page

ఆరేళ్లు ప్రేమించి...పెళ్లి మాత్రం వద్దన్నాడు

May 3 2015 11:55 PM | Updated on Apr 8 2019 6:21 PM

ప్రేమ పేరుతో లోబరుచుకుని, చివరికి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై పోలీసులుకేసు నమోదు చేశారు.

హయత్‌నగర్(రంగారెడ్డి జిల్లా): ప్రేమ పేరుతో లోబరుచుకుని, చివరికి పెళ్లికి నిరాకరించిన యువకుడిపైపోలీసులుకేసు నమోదు చేశారు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కొలిచెర్లకు చెందిన అంజయ్య కుమారుడు శ్రీనివాస్ (28), హయత్‌నగర్‌లోని శాంతినగర్‌కు చెందిన ఓ యువతి (25) నిజామాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో 2011 వరకు బీటెక్ చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.

 

పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్రీనివాస్ ఆ యువతితో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. గత ఆరేళ్లుగా వీరి సంబంధం కొనసాగుతోంది. తీరా పెళ్లి చేసుకొమ్మని యువతి ఒత్తిడి చేయగా శ్రీనివాస్ నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement