సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తోంది. పదోతరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో అభ్యాసనకు ఎక్కువ సమయం కేటాయించేలా సంక్షేమ శాఖలు ప్రణాళికలు రూపొందించాయి. దీనిలో భాగంగా రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ అదనంగా స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాన్ని ఇస్తున్నారు. మధ్యాహ్నం పూట మాత్రం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఇస్తున్నారు. విద్యార్థులకు రాత్రి భోజనం సాయంత్రం 7 గంటలకు ఇస్తుండటంతో 9 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తారు.
టెన్త్ విద్యార్థులకు అదనం..
పదో తరగతి విద్యార్థులకు మాత్రం అదనంగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మరోసారి ఇవ్వనున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యే టెన్త్ విద్యార్థులకు సమోసా, దిల్పసంద్, టీ, పండ్లు తదితరాలు రోజుకో రకం చొప్పున ఇవ్వనుంది. ఇలా పరీక్షలు ముగిసే వరకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక బడ్జెట్ను ఎస్సీ అభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ. 15 చొప్పున వంద రోజుల పాటు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 715 సంక్షేమ హాస్టళ్లున్నాయి. వీటిలో పదో తరగతి చదువుతున్న వారు 22 వేలకుపైగా ఉన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో రెండ్రోజుల నుంచి కొత్త మెనూను అమలు చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. విద్యార్థులు కూడా ఉత్సాహంతో స్టడీ అవర్స్లో కొనసాగుతున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు.
త్వరలో ఎస్టీ, బీసీ హాస్టళ్లలోనూ..
ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రత్యేక మెనూను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి శాఖలో కూడా అమలు చేసేందుకు ఆయా శాఖ చర్యలు తీసుకుంటున్నాయి. అత్యుత్తమ ఫలితాల కోసం వినూత్న కార్యక్రమాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సమోసా, టీ, దిల్పసంద్..
Published Sun, Jan 6 2019 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement