సాక్షి  మ్యాథ్‌బీ–2018 తెలంగాణ రాష్ట్ర విజేతలు వీరే

Sakshi Math Bee Competition 2018 Winners

హైదరాబాద్‌: ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి  మ్యాథ్‌బీ–2018 (కేటగిరీ–1, 2, 3, 4, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో  మ్యాథ్స్‌ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

కేటగిరీ–1:

సాక్షి మ్యాథ్‌బీ కేటగిరీ–1 విజేతలు

ప్రథమ బహుమతి
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘అర్జున్‌ రాఘవ్‌’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతి
హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్‌æ స్కూల్‌(బాచుపల్లి)లో చదువుతున్న ‘లిఖిత్‌ జల్లి’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
తృతీయ బహుమతి
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘తనయ్‌ చౌదరీ’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

కేటగిరీ–2: 

సాక్షి మ్యాథ్‌బీ కేటగిరీ–2 విజేతలతో  అక్షర్‌ స్కూల్‌ సొల్యూషన్స్‌ ఎండీ శ్రీనివాస్‌

ప్రథమ బహుమతి
హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్‌æ స్కూల్‌(బాచుపల్లి)లో చదువుతున్న ‘కనూవ్‌ సింగాల్‌’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతి
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘ఇషాన్‌ సక్సేనా’  కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
తృతీయ బహుమతి
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘ఎం. శ్రీయాన్‌రెడ్డి’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

కేటగిరీ–3: 

సాక్షి మ్యాథ్‌బీ కేటగిరీ–3 విజేతలు

ప్రథమ బహుమతి
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘అచింత్య గోయల్‌’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతి
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘అరిట్రో రే’  కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
తృతీయ బహుమతి
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘ఆయూశ్‌ రంజన్‌’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

కేటగిరీ–4: 

సాక్షి మ్యాథ్‌బీ కేటగిరీ–4 విజేతలు 

ప్రథమ బహుమతి
హైదరాబాద్‌లోని వికాస్‌ ద కాన్సెప్ట్‌ స్కూల్‌(బాచుపల్లి)లో చదువుతున్న ‘సాయి సుందర సందీప్‌ గంటి’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతి
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘హీర్ష్‌ సమ్‌దాని’  కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
తృతీయ బహుమతి
హైదరాబాద్‌లోని వికాస్‌ ద కాన్సెప్ట్‌ స్కూల్‌(బాచుపల్లి)లో చదువుతున్న ‘శ్రీవంత్‌ విష్ణు వజ్జల’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top