నిజామాబాద్ అర్బన్, న్యూస్లైన్: అకాల వర్షాలు అన్నదాతను ఆవేదనకు గురి చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. జిల్లాలోని చాలా చోట్ల ఇప్పటికే వరి కోతలు పూర్తి అయ్యాయి. కళ్లాల లో ధాన్యం కుప్పలుగా పోసి ఉంది. కొ నుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యానికి కూడా రక్షణ లేకుండా పోయింది. అకాల వర్షాలతో వేలాది బస్తాల ధాన్యం తడిసి ముద్దగా మారింది.
వందలాది ఎకరాలలో పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో 289 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతులు కళ్లాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న తరు ణంలోనే వర్షం కురియడం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. జిల్లాలో 60 వేల క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీని నష్టం రూ. 80.70 లక్షల వరకు ఉంటుందని అంచనా. వడ్ల గింజలు రాలిపోయి పొ లంలోనే మొలకెత్తుతున్నాయి. ఇప్పటికే 183 హెక్టార్లలో వరి పంట నీటి పాలైంది. దీని నష్టం రూ. 18.30 లక్షలుగా ఉంటుందని వ్యవసాయశాఖ ధికారులు పే ర్కొంటున్నారు. నష్టం విలువ రూ.99 లక్షల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు.
నివేదికను అతి త్వరలోనే ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, మార్కెట్ యార్డులలో అధికారులు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతుల కళ్లముందే ధాన్యం నీళ్ల పాలైంది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో వ్యాపారులకు చెందిన ఐదు వేల బస్తాలు, రైతులకు చెందిన 1100 బస్తాలు నీటి పాలయ్యాయి. రంగుమారిన ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారని వారు ఆవేదన చెందుతున్నారు.
సిరికొండలో అధిక వర్షపాతం
జిల్లాలోని అత్యధికంగా సిరికొండలో వర్షపాతం న మోదైంది. ఇక్కడ 12.8 మి.మీటర్ల వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో 7.2 మి.మీటర్లు, ఎల్లారెడ్డిలో 6.0 మి. మీ, సదాశివనగర్లో 5.0 మి.మీ, ధర్పల్లిలో 4.2 మి. మీ, ఆర్మూర్లో 3.0 మి.మీ, కామారెడ్డిలో 4.8 మి. మీ, తాడ్వాయిలో 5.0మి.మీ. వర్షపాతం నమోదైంది.
అకాల వర్షాలతో నష్టం రూ 99 లక్షలు
Published Sun, May 11 2014 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement