విద్యార్థులకు తప్పిన ప్రమాదం | road accident in hyderabad | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు తప్పిన ప్రమాదం

Mar 19 2015 2:19 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ : ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నగరంలోని దబీర్‌పుర వంతెనపై వెళ్తున్న బస్సు చక్రం ఊడిపోయింది. ఈ సంఘటన నుంచి బస్సులో ఉన్న విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం... సంతోష్ నగర్ గౌతం టాలెంట్ స్కూల్ కు చెందిన బస్సు వివిధ ప్రాంతాల నుంచి 8 మంది విద్యార్థులతో వెళ్తోంది. దబీర్ పుర వంతెన దగ్గరకు రాగానే బస్సు చేరుకోగానే చక్రం ఊడిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.  విద్యార్థులను వేరొక వాహనంలో స్కూల్‌కు పంపించారు.
(మన్సూరాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement