కిల్లీ దగ్గర వచ్చింది లొల్లి | riot takes place at panshop | Sakshi
Sakshi News home page

కిల్లీ దగ్గర వచ్చింది లొల్లి

Feb 14 2015 10:54 PM | Updated on Oct 2 2018 6:46 PM

పాన్‌షాప్‌లో కిల్లీ కట్టే సమయంలో వివాదం తలెత్తడంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై బాహాబాహీకి దిగారు.

కుత్బుల్లాపూర్ : పాన్‌షాప్‌లో కిల్లీ కట్టే సమయంలో వివాదం తలెత్తడంతో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్, చింతల్ గణేశ్ నగర్ బస్టాప్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. మొదట ఇద్దరితో ప్రారంభమై.. ఆపై తొమ్మిది మంది..ఇలా ఒకరికొకరు తోడవుతూ నానా హంగామా సృష్టించారు.

సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటనను అక్కడున్న వారంతా చూసి విస్తుపోయారు. కొందరు వ్యక్తులు 20 నిమిషాలపాటు వీరంగం సృష్టించారు. గణేష్ నగర్లో బస్సు దిగిన ప్రయాణికులు ఈ గొడవను చూసి భయంతో పరుగులు తీశారు. స్థానికులు 100కు ఫోన్ చేయడంతో జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement