హ్యాట్రిక్‌ ‘కొండూరి’..! | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ ‘కొండూరి’..!

Published Mon, Mar 2 2020 8:21 AM

Ravinder Rao Is KDCCB Chairman As Third Time - Sakshi

సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా జిల్లాకు చెందిన కొండూరి రవీందర్‌రావు ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ కావడం ఇది మూడోసారి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్‌ (టెస్కాబ్‌) చైర్మన్‌గా రవీందర్‌రావు ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. మరోసారి టెస్కాబ్‌ చైర్మన్‌గా రవీందర్‌రావు పేరును సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆయన రాష్ట్రస్థాయిలో టెస్కాబ్‌ చైర్మన్‌ పదవి కోసం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఈనెల 5న టెస్కాబ్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే అన్ని జిల్లాల్లోనూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్లుగా ఎన్నిక కావడంతో రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్‌ చైర్మన్‌గా రవీందర్‌రావు ఎన్నిక లాంఛనమే అయింది.

15 ఏళ్లుగా సహకార రంగంలో..
గంభీరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన రవీందర్‌రావు ఉమ్మడి జిల్లా స్థాయిలో మూడోసా రి చైర్మన్‌గా ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించా రు. తొలిసారి 2005 లో గంభీరావుపేట మండలం గజసింగవరం నుంచి డైరెక్టర్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా  ఎన్నికై కేడీసీసీ బ్యాంక్‌ పదవి అలంకరించారు. ఎన్నికయ్యారు. రెండోసారి 2013లోనూ జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యా రు. 2015లో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా స హకార రంగంలో పనిచేసే ఉద్యోగుల హెచ్‌ఆర్‌ పాలసీ అమలు కమిటీకి రవీందర్‌రావు చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు. 15 ఏళ్లుగా సహకార రంగంలో రవీందర్‌రావు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్‌ బంకుల ఏర్పాటు, ప్రతి సహకార సంఘాన్ని బ్యాంకులా మార్చేందుకు ఆయన శ్రమించారు.

జిల్లాకు ఆరు డైరెక్టర్‌ పదవులు...
జిల్లాకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాస్థాయిలో ఆరు డైరెక్టర్‌ పదవులు లభించాయి. కేడీసీసీబీలో డైరెక్టర్లుగా వుచ్చిడి మోహన్‌రెడ్డి (అల్మాస్‌పూర్‌), భూపతి సురేందర్‌ (కొత్తపల్లి), జల్గం కిషన్‌రావు (సనుగుల), వీరబత్తిని కమలాకర్‌ (సిరిసిల్ల), ముదిగంటి సురేందర్‌రెడ్డి (నర్సింగా పూర్‌), గాజుల నారాయణ (సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌)లకు సహకార డైరెక్టర్లుగా అవకాశం లభించింది. సహకార ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సముచిత స్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్‌గా రవీందర్‌రావు ఉండగా... రాష్ట్ర స్థాయిలోనూ టెస్కాబ్‌ చైర్మన్‌ అవకాశం ఆయనకే లభించడంతో మరోసారి రాష్ట్ర స్థాయి పదవి రాజన్న సిరిసిల్ల జిల్లాకు లభించింది. పలువురు జిల్లా నాయకులు రవీందర్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement