రైల్వే బడ్జెట్ పూర్తిగా అబద్ధాల పుట్ట అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు.
రైల్వే బడ్జెట్ పూర్తిగా అబద్ధాల పుట్ట అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ ఇంత అన్యాయంగా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
కేంద్రంతో మీ లోపాయికారీ ఒప్పందం ఏంటని నిలదీశారు. తెలుగు రాష్ట్రాలకు అరకొర నిధులు మాత్రమే ఇచ్చినా, రెండు రాష్ట్రాల సీఎంలయిన ఇద్దరు చంద్రులు ఎందుకు స్పందించడంలేదని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.