డీఎస్, జానా, దామోదరతో పొన్నాల భేటీ | Ponnala lakshmaiah meets D srinivas, damodara rajanarsimha, janareddy | Sakshi
Sakshi News home page

డీఎస్, జానా, దామోదరతో పొన్నాల భేటీ

Mar 18 2014 11:06 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ను కలిశారు.

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ను కలిశారు. పార్టీలో పెరుగుతున్న అంతరాన్ని తగ్గించుకునేందుకు పొన్నాల యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందర్నీ కలుపుకు పోయేలా ఆయన ప్రయత్నాలు చేస్తున్నరు.

ఈ మేరకే పొన్నాల ఈరోజు ఉదయం డీ శ్రీనివాస్తో పాటు దామోదర రాజనర్సింహ, జానారెడ్డి తదితరులను వేర్వేరుగా కలిశారు. కాగా పీసీసీ అధ్యక్ష పీఠం కోసం డీఎస్తో పాటు జానారెడ్డి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష పీఠం పొన్నాలను వరించటంతో ఆయన అందరితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ భేటీతో సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement