డిటోనేటర్ పేలి వ్యక్తి మృతి | person died in detonator blast | Sakshi
Sakshi News home page

డిటోనేటర్ పేలి వ్యక్తి మృతి

Apr 18 2015 7:14 PM | Updated on Sep 3 2017 12:28 AM

నాగర్కర్నూల్ అటవీప్రాంతంలో డిటోనేటర్ పేలి ఓ వ్యక్తి మరణించాడు.

జిల్లాలోని నాగర్కర్నూల్ అటవీప్రాంతంలో డిటోనేటర్ పేలి ఓ వ్యక్తి మరణించాడు. దేవరకద్రకు చెందిన ఇందిరమ్మ(40), లింగయ్య(45) అనే దంపతులు అడవి పందుల వేట కోసం శనివారం నాగూర్ కర్నూల్‌కు వెళ్లారు.

అటవీ ప్రాంతంలో డిటోనేటర్లు ఉపయోగించి పందులును వేటాడేందుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు ఓ డిటోనేటర్ పేలి లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, తీవ్రంగా గాయాలైన ఇందిరమ్మను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందిరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement