తెలంగాణలో మాఫియా రాజ్యం | Mafia kingdom in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మాఫియా రాజ్యం

Aug 2 2017 3:57 AM | Updated on Oct 8 2018 4:18 PM

తెలంగాణలో మాఫియా రాజ్యం - Sakshi

తెలంగాణలో మాఫియా రాజ్యం

తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని విరసం నేత వరవరరావు అన్నారు.

విరసం నేత వరవరరావు
 
పెద్దపల్లి రూరల్‌: తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని విరసం నేత వరవరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్య మ సమయంలో ‘నక్సల్స్‌ ఎజెండా యే నా ఎజెండా’ అన్న కేసీఆర్‌ కుర్చీ ఎక్కిన తర్వాత దొరల పోకడకు తెర తీశార న్నారు. నేరెళ్ల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇసుక మాఫియా నిందితుల ఆస్తులను పంచాలన్నారు.

కరీంనగర్‌ జైలులో ఉన్న నేరెళ్ల బాధితులను వరవరరావు పరా మర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.  ఇక్కడి ఇసుక మాఫియా మామూలుది కాదని.. సింగపూర్, మలేషియాలకు ఇసుక రవాణా చేస్తున్న గోల్డ్‌స్టోల్‌ కంపెనీకి చెందిందని, దీనికి కేటీఆర్‌తో సంబంధాలున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement