'వాటర్గ్రిడ్'కు స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్ | Sakshi
Sakshi News home page

'వాటర్గ్రిడ్'కు స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్

Published Tue, Jan 27 2015 2:43 PM

'వాటర్గ్రిడ్'కు స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ వాటర్గ్రిడ్ పనులను మంగళవారం పర్యవేక్షించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద ఎంజీఎల్ఐ ప్రాజెక్టు సమీపంలో వాటర్గ్రిడ్ కోసం స్థలాన్ని కేటీఆర్ పరిశీలించారు. జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, నిరంజన్ రెడ్డి, తదితరులు కేటీఆర్కు జిల్లా పరిస్థితిని వివరించారు. అనంతరం కొల్లాపూర్లో అధికారులతో సమీక్ష జరిపారు. వాటర్గ్రిడ్ పథకానికి సంబంధించిన అంశాలపై అధికారులతో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ చర్చించారు.

Advertisement
Advertisement