చిలుకూరులో భక్తుల సందడి | Heavy rush at Chilkur Balaji Temple | Sakshi
Sakshi News home page

చిలుకూరులో భక్తుల సందడి

Dec 12 2015 8:17 PM | Updated on Sep 3 2017 1:53 PM

తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.

మొయినాబాద్ : తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. రెండవ శనివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 108 ప్రదక్షిణలు నిలిపివేసి కేవలం 11 ప్రదక్షిణలకు మాత్రమే అనుమతించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రెండు వరుసల్లో మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement