సాక్షిప్రతినిధి, మహబూబ్నగర్ : ప్రభుత్వ స్థలాల్లో దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసుకున్న ‘గూడు’ను పేదలు క్రమబద్ధీకరించుకునే ప్రక్రియకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడతగా దాదాపు 443మంది పేదలకు భూ క్రమబద్ధీకరణ కింద పట్టాలు మంజూరు చేసింది. వీటిని ఈ నెల 7వ తేదీన జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాల ముగింపు సభలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు.
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తదితరులు లబ్ధిదారులకు ఈ పట్టాలు పంపిణీ చేయనున్నారు. అయితే జీఓ 58 కింద జిల్లాలోని 64 మండలాలకు చెందిన 5226 మంది 125గజాల్లోపు గల తమ స్థలాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిపై దాదాపు 7 నెలలుగా వివిధ దశలుగా విచారణ జరిపిన అధికారులు వీటిలో 443 మంది లబ్ధిదారులు అర్హులుగా గుర్తించి మండలాల వారిగా పట్టాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.
జీఓ 58 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ప్రభుత్వ స్థలాలకు సంబంధించి పలు ప్రభుత్వపరమైన అంశాలు కొన్ని శాఖలకు అభ్యంతరాలు ఉండడం వంటి సాంకేతిక అంశాలు ముడిపడి ఉండడంతో 3,764 దరఖాస్తులను ఇప్పటికిప్పుడు పరిష్కరించే పరిస్థితి లేదని వీటిపై సమగ్ర విచారణతో పాటు ఆయా ప్రభుత్వ శాఖలతో సంప్రదించాల్సి ఉందన్న పేరుతో ఆ దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు చేతులెత్తేశారు. మిగిలి ఉన్న 1013 దరఖాస్తులను అధికారులు విచారణ చేయాల్సి ఉంది.
ఇది ఎప్పటికి పూర్తవుతుందోనని ఇందులో ఎంతమందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తిస్తుందనే ఆందోళన నెలకొంది. 7 నెలల నిరీక్షణ అనంతరం కనీసం 443 మందికైనా ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ చేయడం దరఖాస్తుదారుల్లో కొంత ఊరట కలిగిస్తున్న మొత్తం దరఖాస్తులను విచారణ జరిపి భూ క్రమబద్ధీకరణను పూర్తిచేయడం ఎప్పటికి అవుతుందోనని నిరాశ, నిస్పృహలు దరఖాస్తుదారుల్లో అలుముకున్నాయి.
ఆందోళనలో జీఓ 59 దరఖాస్తుదారులు...
250గజాలకు మించి ప్రభుత్వ స్థలాలను ఆధీనంలో ఉంచుకున్న వాటిని క్రమబద్ధీకరించడం కోసం జీఓ నెం.59 పేరుతో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ జీఓ ప్రకారం జిల్లాకు చెందిన 424మంది దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం సూచించిన విధంగా రుసుము సైతం చెల్లించారు. అందువల్ల ప్రభుత్వానికి రూ.11 కోట్లకు పైగా ఆదాయం లభించింది. అయితే ఈ దరఖాస్తుదారులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరుపకపోవడం.. అర్హులెవరో గుర్తించకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేవన్న కారణంతో జిల్లాలో అధికారులు ఇప్పటి వరకు కనీసం విచారణ సైతం జరుపకపోవడంతో 59 జీఓ కింద దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
గ్రీన్సిగ్నల్
Published Sat, Jun 6 2015 12:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement