గవర్నర్‌ జాయింట్ సెక్రటరీకి గాయాలు


నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో గవర్నర్‌ నరసింహన్‌ జాయింట్ సెక్రటరీ బసంత్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైయ్యింది. కుటుంబసభ్యులతో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.



ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు టైర్‌ పగిలి కారు బోల్తా పడింది.  ఈ ఘటనలో బసంత్‌ కుమార్‌కు గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనేసమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top