'ప్రతిపక్షాల పోరాటం వల్లే సర్కారు దిగొచ్చింది' | government ready to solve after oppsition fought over farmers issue says congress leaders | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్షాల పోరాటం వల్లే సర్కారు దిగొచ్చింది'

Sep 29 2015 3:22 PM | Updated on Mar 18 2019 9:02 PM

ప్రతిపక్షాల పోరాటం వల్లే రైతు ఆత్మహత్యలపై సర్కారు దిగొచ్చిందని తెంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రామ్మోహన్ రెడ్డిలు అన్నారు.

హైదరాబాద్: ప్రతిపక్షాల పోరాటం వల్లే రైతు ఆత్మహత్యలపై సర్కారు దిగొచ్చిందని తెంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రామ్మోహన్ రెడ్డిలు అన్నారు. రైతు ఆత్మహత్యల పరిహారాన్ని జూన్ నుంచి ఇవ్వాలన్న తమ డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గిందని తెలిపారు. రుణమాఫీ మొత్తం ఒకే దఫాలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలను గ్రామసభల ద్వారా నిర్ధారించాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ 1400 మంది రైతుల సంఖ్యను కుదించరాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement