ఒక్కడి కోసం ఐదుగురు  | Five Officers for one student in Tenth Supplementary At Kutbullapur | Sakshi
Sakshi News home page

ఒక్కడి కోసం ఐదుగురు 

Jun 15 2018 1:49 AM | Updated on Jun 15 2018 1:49 AM

Five Officers for one student in Tenth Supplementary At Kutbullapur - Sakshi

హైదరాబాద్‌: ఓ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌..మరో చీఫ్‌ సూపరింటెండెంట్, ఒక ఇన్విజిలేటర్‌.. కాపలాగా హోంగార్డు.. తనిఖీ నిమిత్తం స్క్వాడ్‌.. ఇలా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఆయా కేంద్రాల వద్ద విద్యాశాఖ నియమించిన అధికారులు. ఈ అధికారులంతా ఒకే ఒక విద్యార్థి కోసం విధులు నిర్వర్తించిన ఘటన కుత్బుల్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.

గురువారం జరిగిన సోషల్‌ పేపర్‌–1కు మొత్తం 11 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా సాయి సందీప్‌ అనే విద్యార్థి మాత్రమే పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఈ ఒక్కడి కోసం వీరంతా తమ విధుల్ని నిర్వర్తించారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ప్రతినిధి స్కూల్‌కు చేరుకుని సాయి సందీప్‌ను పరీక్ష ఎలా రాశావని పలకరించగా అతడు నవ్వుతూ వెళ్లిపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement