మహిళను రక్షించబోయి తండ్రీకొడుకుల మృతి | father and son killed due to current shock in vikarabad | Sakshi
Sakshi News home page

మహిళను రక్షించబోయి తండ్రీకొడుకుల మృతి

May 7 2016 11:05 AM | Updated on Aug 16 2018 4:21 PM

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పీరంపల్లిలో విషాదపు చాయలు అలుముకున్నాయి.

వికారాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పీరంపల్లిలో విషాదపు చాయలు అలుముకున్నాయి. పరోపకారానికి పోయి తండ్రీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు. లావణ్య అనే మహిళ శనివారం ఉదయం ఇంటి ముందు తీగపై దుస్తులు ఆరేస్తుండగా...పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎర్త్‌వైర్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యి షాక్‌కు గురైంది.

పక్క ఇంట్లో ఉండే యాదయ్య గమనించి ఆమెను కాపాడబోయాడు. ఈ క్రమంలో యాదయ్య షాక్‌కు గురి కాగా, అతన్ని కాపాడేందుకు వచ్చిన కుమారుడు రాజు కూడా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. లావణ్య వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement