పత్తి మోసాలకు పాల్పడుతున్న దళారులను నిర్బంధించిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం: పత్తి మోసాలకు పాల్పడుతున్న దళారులను నిర్బంధించిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వేంసూర్ మండలం రామన్నపాలెంలో పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్న పత్తి దళారులను గ్రామస్తులు మంగళవారం నిర్బంధించారు. ఆరుగాలం పండించిన పంటను దళారులు దోచుకుంటే సహించేది లేదని రైతులు తీవ్రంగా హెచ్చరించారు.