'జూడాలు మానవత్వంతో వ్యవహరించాలి' | Dy CM T Rajaiah calls junior doctors call off strike | Sakshi
Sakshi News home page

'జూడాలు మానవత్వంతో వ్యవహరించాలి'

Oct 18 2014 10:12 AM | Updated on Sep 6 2018 3:01 PM

'జూడాలు మానవత్వంతో వ్యవహరించాలి' - Sakshi

'జూడాలు మానవత్వంతో వ్యవహరించాలి'

మానవత్వంతో వ్యవహరించాలని సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య శనివారం వరంగల్లో హితవు పలికారు.

వరంగల్ :  మానవత్వంతో వ్యవహరించాలని సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య శనివారం వరంగల్లో హితవు పలికారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆయన జూడాలకు విజ్ఞప్తి చేశారు. రూరల్ సర్వీసు మినహా జూడాల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని రాజయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.  

జూనియర్ డాక్టర్లు విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కేసీఆర్ సర్కార్ జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తున్నామంటూ జూడాలు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement