డీఎస్, బొమ్మ వర్గీయుల పోటాపోటీ
శ్రేణులలో ‘మైనారిటీ’ పదవుల చిచ్చు
టీపీసీసీకి ఫిర్యాదుల పరంపర
సభ్యత్వ నమోదులోను విభేదాలు
అస్తవ్యస్తంగా మారిన జిల్లా కాంగ్రెస్ పరిస్థితి
ఓడినా మారని పరిస్థితి పట్టించుకోని ఆధిష్టానం
గతంలోనూ ఇదే తీరు
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కల హాలు ముదిరి పాకాన పడుతున్నాయి. సాధారణ ఎన్నికలలో ఘోర పరాజ యం పొందినా ఆ పార్టీ నేతలలో మార్పు రావడం లేదు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన నాయకులు గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్, మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్రెడ్డి తదితర దిగ్గజాలున్న జిల్లా లో వర్గపోరుతో కాంగ్రె స్ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం లేకపోలేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరులో ప్రారంభం కావాలిన సభ్యత్వ నమోదు కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా, మరికొన్ని చోట్ల సభ్యత్వ నమోదులోనూ విభేదాలే బయట పడుతున్నాయి. దిగ్గజాల వైఖరి ‘ఎవరికీ వారే యమునా తీరే’లా మారగా నిజామాబాద్ అర్బన్లో మైనారిటీలకు ప్రాధాన్యం లేదన్న చిచ్చు రగులుతోంది. ఈ విషయమై డి.శ్రీనివాస్, బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ వర్గీయులు టీపీసీసీకి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
అన్నీ వివాదాలే
కాంగ్రెస్ పార్టీ నగరంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి డీఎస్, ఆయన వర్గీయులు హాజరు కాగా, అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, ఆయన వర్గం హాజరు కాలేదు. నగర కమిటీ అధ్యక్షుడు కేశ వేణు అధ్యక్ష తన జరిగిన సమావే శంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ ఫోటోను చేర్చలేదన్న అంశం వివాదంగా మారింది. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ జావిద్ అక్రమ్ ఈ అంశాన్ని ప్రస్తావించగా, నగర కమిటీ సభ్యత్వ సేకరణ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడి ఫోటో అవసరం లేదని సమర్థించడంపైనా కలకలం రేగింది. బొమ్మ మహేశ్ కుమార్కు సమాచారం ఇవ్వలేదంటూ ఆయన అనుచరులు సైతం కార్యక్రమాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్కు 16 మంది కార్పొరేటర్లుంటే ఐదారుగురే వచ్చారు. ఒకే వర్గానికి చెందిన నేతలతో కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా పార్టీ సీనియర్ల నుంచి వినిపిం చాయి. అర్బన్ ఇన్చార్జ్గా బొమ్మ మహేశ్ వ్యవహరిస్తుండగా, డీఎస్ తనయులు, మాజీ మేయర్ సంజయ్, అరవింద్ కాంగ్రెస్ కేడర్కు ఎస్ఎంఎస్లు పంపడం, ప్రెస్మీట్లు నిర్వహించడం గందరగోళానికి తెరతీస్తోంది. చినికి చినికి గాలివానగా మారుతున్న ఆధిపత్యపోరు, అంతర్గత విభేధాలు అధిష్టానానికి తలనొప్పిగా పరిణమిం చాయి.
మైనారిటీలకు పదవులపై రభస
కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు పదవుల కేటాయింపు వివాదాస్పదం అవుతోంది. ఈ విషయమై డీఎస్, బొమ్మ మహేశ్కుమార్ వర్గీయులు టీపీసీసీకి పోటాపోటీగా ఫిర్యాదులు చేయడం కలకలం రేపుతోంది. మైనారిటీలకు రాష్ట్రస్థాయి పదవులు దక్కడం అరుదుగా మారిన తరుణంలో, ఇటీవల మహ్మద్ ఇలియాస్కు రాష్ట్ర కార్యదర్శి గా అవకాశం దక్కింది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర కార్యదర్శులుగా జిల్లాకు చెందిన భూమారెడ్డి, రాయల్వార్ సత్యం, నరాల రత్నాకర్, ప్రేమ్దేవ్ అగర్వాల్, రాజేంద్రప్రసాద్ తదితరులకు అవకాశాలు దక్కాయి. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల సమయంలో అర్బన్ మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదన్న వాదని కూడా వినిపించింది. అందుకే వారు ఎన్నికలలో పార్టీకి దూరమయ్యారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ, బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఇలియాస్కు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇలియాస్కు పదవి దక్కడం ఇష్టం లేని ప్రత్యర్థి వర్గం నేతలు 15 సంవత్సరాల కిందట పోలీసు కేసులు ఉన్నాయంటూ బయటకు తీసి టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఇలియాస్ వర్గం మరో అడుగు ముందుకేసి, తనపై ఫిర్యాదు చేసిన నాయకులపై ఉన్న భూముల ఆక్రమణ, సెటిల్మెంట్ వ్యవహారాలు, కేసుల చిట్టా తయారు చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ విభేధాలు అన్ని నియోజకవర్గాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అధిష్టానం జోక్యం చేసుకుంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని కార్యకర్తలు కోరుతున్నారు.
ఇంటి పోరు
Published Wed, Nov 12 2014 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement