డిప్యూటీ డీఈఓ ఆకస్మిక తనిఖీలు | Deputy Deo sudden visit to schools in yalala mandal | Sakshi
Sakshi News home page

డిప్యూటీ డీఈఓ ఆకస్మిక తనిఖీలు

Feb 20 2016 4:38 PM | Updated on Mar 28 2018 11:26 AM

యాలాల మండలంలోని పగిడియాల, ముద్దాయిపేట ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ డీఈఓ హరీష్ చందర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

యాలాల(రంగారెడ్డి): యాలాల మండలంలోని పగిడియాల, ముద్దాయిపేట ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ డీఈఓ హరీష్ చందర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా విద్యార్థులు ఏ విధంగా వత్తిడిని జయించాలి అనే అంశంపై మాట్లాడారు. దీంతో పాటు డిజిటల్ క్లాసుల ద్వారా ప్రముఖ సైకాలిజిస్టు డా. బి.వి పట్టాభిరామ్.. వత్తిడి సంబంధిత సీడీలను విద్యార్థుల ముందు ప్రదర్శించారు. డీఈవో హరీష్ చందర్ తో పాటు మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఈ ఆకస్మిక తనిఖీలలో పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement