అంతా డబుల్.. ఎందుకీ ట్రబుల్

టెన్త్ పరీక్ష ఫీజుల ప్రక్రియలో విద్యాశాఖాధికారుల వింత వైఖరి
ఆన్లైన్ విధానం ఉన్నప్పటికీ మాన్యువల్ పత్రాలు కోరుతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి నామినల్రోల్స్ (ఎన్ఆర్) సమర్పణ ఆన్లైన్ విధానంలోకి మార్చినప్పటికీ విద్యాశాఖాధికారులు మాన్యువల్ పద్ధతికే ప్రాధాన్యమివ్వడం ఉపాధ్యాయులకు చిక్కులు తెచ్చిపెడుతుంది. పదోతరగతి పరీక్ష ఫీజు గడువు ఈనెల 7తో ముగిసింది. విద్యార్థుల నుంచి స్వీకరించిన ఫీజులను ప్రధానోపాధ్యాయులు ఈనెల 11లోగా విద్యాశాఖకు సమరి్పంచాలి. అనంతరం పాఠశాల నుంచి ఫీజు చెల్లించిన వారి వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పగించాలి.
కానీ ఆన్లైన్ పద్ధతితో పాటు మాన్యువల్గా ఎన్ఆర్లు సమరి్పంచాలని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈమేరకు ఎన్ఆర్ నమూనాలు, చలానా కాగితాలను పాఠశాలలకు పోస్టులో పంపారు. వీటిలో విద్యార్థుల వివరాలను రాసి గడువులోగా ఇవ్వాలని విద్యాశాఖాధికారులు సూచించారు. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసిన తర్వాత మాన్యువల్గా ఎన్ఆర్ పత్రంలో తిరిగి విద్యార్థుల పేర్లను రాయాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి