
కె.చంద్రశేఖర రావు
రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగుల కేటాయింపు తీరుపై తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగుల కేటాయింపు తీరుపై తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రక్రియను తిరిగి సమీక్షించాలని ఆయన భావిస్తున్నారు.
ఉద్యోగులు ఏ రాష్ట్రానికి వెళ్లాలన్న ఆఫ్షన్ వద్దని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాతే తన వైఖరి వెల్లడిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. వారితో చర్చించిన తరువాత ఉద్యోగుల ఆఫ్షన్లపై కెసిఆర్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.