స్థానికత’కు ప్రాతిపదికగా తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు.
సాక్షి, హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 1956 సంవత్సరాన్ని ‘స్థానికత’కు ప్రాతిపదికగా తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. నగరంలో ఉన్న పేదవిద్యార్థులు ఫీజురీయింబర్స్మెంటును నమ్ముకుని చదువుకుంటున్నారని, వారిపాలిట ఈ నిబంధన శాపంగా మారే విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు. దత్తాత్రేయ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.