రామగుండం ఎన్టీపీసీలో టెండర్ల విషయంలో సోమవారంకాంట్రక్ట్టర్ల మధ్య ఘర్షణ జరిగింది.
కరీంనగర్(జ్యోతి నగర్): రామగుండం ఎన్టీపీసీలో టెండర్ల విషయంలో సోమవారంకాంట్రక్ట్టర్ల మధ్య ఘర్షణ జరిగింది. రూ.62 లక్షల పనులకు టెండర్లు వేసే విషయంలో కాంట్రక్టర్ల మధ్య వైరం ఏర్పడింది. దీంతో అధికారుల సమక్షంలోనే టెండర్ డాక్యుమెంటులు చించివేసుకుని తోపులాటకు దిగారు. ఈ విషయమై యాజమాన్యానికి ఇరువర్గాలు ఫిర్యాదు చేశాయి. దీంతో అధికారులు టెండర్ ప్రక్రీయను వాయిదా వేశారు.