కేసీఆర్‌ పర్యటనలో అపశృతి

constable injured while cm kcr Convoy hits him - Sakshi

సాక్షి, కొత్తూరు : తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్‌ శుక్రవారం జిల్లాలోని కొత్తూరు మండలంలో ఉన్న జహంగీర్‌పీర్‌ దర్గాను దర్శించుకోవడానికి బయలుదేరారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లోని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వాహనం ఢీకొని ఓ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధిత కానిస్టేబుల్‌ను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ కీసర పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న రవి కిరణ్‌గా గుర్తించినట్లు సమాచారం.  

కాగా, జహంగీర్‌పీర్‌ దర్గాను దర్శించిన ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కు చెల్లించుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాను సందర్శించి, మొక్కు చెల్లించుకుంటానని గతంలో మొక్కుకున్న కేసీఆర్‌.. ఈ క్రమంలోనే నేడు జహంగీర్‌ పీర్‌ దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకుని, చాదర్‌ను సమర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top