తప్పుడు మాటలొద్దు, లెక్కలు తీయండి | congress mp gutta sukhendar reddy slams telangana government | Sakshi
Sakshi News home page

తప్పుడు మాటలొద్దు, లెక్కలు తీయండి

Oct 14 2014 9:52 AM | Updated on Mar 18 2019 9:02 PM

తప్పుడు మాటలొద్దు, లెక్కలు తీయండి - Sakshi

తప్పుడు మాటలొద్దు, లెక్కలు తీయండి

టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. సర్వేలు, దరఖాస్తులతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

నల్గొండ : టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. సర్వేలు, దరఖాస్తులతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వాల తప్పిదం వల్లే విద్యుత్ సమస్య అంటూ టీఆర్ఎస్ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, లెక్కలు తీసి చూసుకోవాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేస్తూ సహించేది లేదని గుత్తా మంగళవారమిక్కడ హెచ్చరించారు.  తెలంగాణ టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే బస్సు యాత్రలు కాదని, చంద్రబాబును ఒప్పించి ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ తెప్పించాలని ఆయన సవాల్ విసిరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement