బల్కంపేట ఎల్లమ్మగుడిలో కేసీఆర్ పూజలు

బల్కంపేట ఎల్లమ్మగుడిలో కేసీఆర్ పూజలు - Sakshi


హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఆలయ అభివృ఼ద్ధికి మరింత పాటుపడతామని చెప్పారు.



కాగా, మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును పరిశీలించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హరితహారం పథకం అమలుచేసే విషయం గురించి పరిశీలించనున్నారు. భారీ ఎత్తున ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాలని అనుకుంటున్నారు.



బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జోగిని రాధిక

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top