- రంగారెడ్డి జిల్లాలో బోగస్ టీచర్ల బాగోతం
- తప్పుడు ధ్రువీకరణతో కొలువులు దక్కించుకున్న వైనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైకల్యం లేదు కానీ వికలాంగుల కోటాలో కొందరికి ఉద్యోగాలు వచ్చాయి.. ఓపెన్ కేటగిరీకి చెందినప్పటికీ రిజర్వ్డ్ కోటాలో మరికొందరికి కొలువులు దక్కాయి.. స్థానికులు కానప్పటికీ లోకల్ కోటా నుంచి బడిపంతుళ్లుగా అవతరించారు. ఇలా 51 మంది తప్పుడుమార్గంలో రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వఉపాధ్యాయ కొలువులను దక్కించుకున్నారు.’ జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించడంతో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
మూడు కేటగిరీల్లో విచారణ
పలువురు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు సంపాదించారంటూ కలెక్టర్ రఘునందన్రావుకు గతేడాది మేలో కొందరు ఆధారాలతో సహా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఆరోపణలు వచ్చిన టీచర్లకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు సేకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వికలత్వ కేటగిరీలో 28 మంది, నకిలీ కులధ్రువీకరణ కేట గిరీలో 3, తప్పుడు బోనఫైడ్ల విభాగంలో 16 మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. మూడు కేటగిరిలో విచారణ చేపట్టారు.
విచారణ లోతుగా.. స్పష్టంగా..
వికలత్వ విభాగంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న టీచర్లు నియామక సమయంలో సమర్పించిన మెడికల్ బోర్డుకు, ఈఎన్టీ ఆస్పత్రికి సర్టిఫికెట్లను పంపించారు. వాటిలో చాలావరకు నకిలీవిగా తేలడంతో తిరిగి ఆయా టీచర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరకు వారికున్న వికలత్వాన్ని నిర్ధారించి ఆ మేరకు మెడికల్ బోర్డు వికలత్వ సర్టిఫికెట్లను జిల్లా యంత్రాంగానికి అందించింది. ఇందులో ఆయా టీచర్లందరికీ అతి తక్కువస్థాయిలో వికలత్వం ఉన్నట్లు బయటపడింది. నిర్ధారించిన వైకల్యం ఉద్యోగ అర్హతకు సరితూగదని మెడికల్బోర్డు స్పష్టం చేసింది.
► నకిలీ కుల ధ్రువీకరణ కేటగిరీలో ముగ్గురిపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవానికి ఆ ముగ్గురు టీచర్లు ఓపెన్ కేటగిరీ (ఓసీ)కి చెందినప్పటికీ.. మున్నూరుకాపు కులానికి చెందినట్లు యంత్రాంగాన్ని తప్పుదోవపట్టించి సర్టిఫికెట్లు పొందినట్లు విచారణలో తేలింది.
► తప్పుడు బోనఫైడ్లు సమర్పించి పలువురు ఉద్యోగాలు పొందారనే అభియోగాలు ఎదుర్కొంటున్న అంశంలో ఉపవిద్యాధికారి, మండల విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 16 మంది టీచర్లకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. విచారణ తుది నివేదిక కమిటీ రూపొందించాల్సి ఉంది.
గురుదేవుళ్ల నకి‘లీలలు’!
Published Thu, Jun 23 2016 12:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు
జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..
మైనార్టీలకు అండగా సీఎం వైఎస్ జగన్
No Headline
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
శ్రమజీవుల కేంద్రం.. రాయదుర్గం
నాటు పడవ బోల్తా
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement