నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులను థర్డ్ డిగ్రీతో హింసించిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ చైర్మన్, సభ్యుడు రాములుకు కూడా ఫిర్యాదు చేశారు. త్వరలోనే సిరిసిల్ల వస్తామని కమిషన్ హామీ ఇచ్చింది. ఇసుక లారీలతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదనలో ప్రశ్నించిన, లారీలను దగ్ధం చేసిన గ్రామస్తులను పోలీసులు పాశవికంగా కొట్టిన విషయం విదితమే.