భీమునిపాదం జలపాతంలో పర్యాటకుల సందడి

Bhemuni Padam Waterfall Is A Popular Tourist Attraction - Sakshi

గూడూరు(మహబూబాబాద్‌): మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని భీమునిపాదం జలపాతంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భీమునిపాదం జలపాతం జాలువారుతోంది.

వర్షాకాలం మొదలు వేసవికాలం చివరి వరకు సెలవు దినాల్లో జలపాతాన్ని వీక్షించడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. సరదాగా స్నానాలు చేస్తు, ప్రకృతి రమణీయతను చూసి కనువిందు పొందుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తిస్తామని పర్యాటక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు చెపుతూ వస్తున్నారు. జలపాతం వద్ద మౌళిక వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top