తల్లి కర్మ నిర్వహిస్తూ మరణించిన కుమారుడు | Sakshi
Sakshi News home page

తల్లి కర్మ నిర్వహిస్తూ మరణించిన కుమారుడు

Published Sat, Sep 19 2015 1:57 PM

A Son died on the day of mothers ritual

తల్లికి కర్మకాండలు చేస్తూ ఓ యువకుడు ఆకస్మికంగా మృతి చెందాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన పులకాని లలితమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు నీటి గుంతలోపడి ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతి చెందిన నాటి నుంచి ఆమె కుమారుడు ఉపేందర్(27) తీవ్ర మనోవేదనతో ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం ఆమె కర్మకాండలు ఏర్పాటు చేశారు. కర్మకాండలు నిర్వహిస్తున్న  ఉపేందర్ తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Advertisement
Advertisement