1,095 ఓట్లకు.. 27 ఓట్లు పోల్‌

27 votes poll to 1095 votes - Sakshi

మున్సిపాలిటీలో విలీనంపై గ్రామస్తుల నిరసన 

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి సమీపంలోని బందంపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో 1,095 మంది ఓటర్లుండగా కేవలం 27 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని మెజార్టీ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామపంచాయతీగా ఉన్న తమ గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో అన్యాయంగా విలీనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో కలపడం ద్వారా ఉపాధిహామీ పథకం దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top